Wednesday, 5 April 2017

తెలుగు వెలుగు

మనం ఇప్పుడు చదవగలిగితే  తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు :

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
మహాప్రస్థానం - శ్రీశ్రీ
ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
మాలపల్లి - ఉన్నవ లక్ష్మినారాయణ
చివరకు మిగిలేది - బుచ్చిబాబు
అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
కాలాతీత వ్యక్తులు - డాక్టర్‌ శ్రీదేవి
వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
కళాపూర్ణోదయం - పింగళి సూరన
సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
గబ్బిలం - గుఱ్ఱం జాషువా
వసు చరిత్ర - భట్టుమూర్తి
అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు
చదువు - కొడవగంటి కుటుంబరావు
ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
కవిత్వ తత్వ విచారము - డాక్టర్‌ సిఆర్‌ రెడ్డి
వేమన పద్యాలు - వేమన
కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి
మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
అల్పజీవి - రావిశాస్త్రి
ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్ర మహాభాగవతం - పోతన
బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
మొల్ల రామాయణం - మొల్ల
అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
మైదానం - చలం
వైతాళికులు - ముద్దుకృష్ణ
ఫిడేలు రాగాల డజన్‌ - పఠాభి
సౌందర నందము - పింగళి, కాటూరి
విజయవిలాసం - చేమకూర వేంకటకవి
కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
మ్యూజింగ్స్‌ - చలం
మనుచరిత్ర- అల్లసాని పెద్దన
పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్‌ స్వామి
పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర
దిగంబర కవిత - దిగంబర కవులు
ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
నీలిమేఘాలు - ఓల్గా
పానశాల - దువ్వూరి రామిరెడ్డి
శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
అంపశయ్య - నవీన్
చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
జానకి విముక్తి - రంగనాయకమ్మ
స్వీయ చరిత్ర - కందుకూరి
మ¬దయం - కెవి రమణారెడ్డి
నారాయణరావు - అడవి బాపిరాజు
విశ్వంభర - సినారె
దాశరథి కవిత - దాశరథి
కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
నీతి చంద్రిక - చిన్నయ సూరి
పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం
ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
పారిజాతాపహరణం - నంది తిమ్మన
పల్నాటి వీర చరిత్ర - శ్రీనాథుడు
రాజశేఖర చరిత్ర - కందుకూరి
రాధికా సాంత్వనము - ముద్దు పళని
స్వప్ప లిపి - అజంతా
సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
శృంగార నైషధం - శ్రీనాథుడు
ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
అను క్షణికం - వడ్డెర చండీదాస్
ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
అడవి ఉప్పొంగిన రాత్రి - విమల
చంఘీజ్‌ ఖాన్‌ - తెన్నేటి సూరి
చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
గద్దర్‌ పాటలు - గద్దర్
హాంగ్‌ మీ క్విక్‌ - బీనాదేవి
ఇస్మాయిల్‌ కవిత - ఇస్మాయిల్
కుమార సంభవం - నన్నే చోడుడు
కొయ్య గుర్రం - నగ్నముని
మైనా - శీలా వీర్రాజు
మాభూమి - సుంకర, వాసిరెడ్డి
మోహన వంశీ - లత
నగరంలో వాన - కుందుర్తి
రాముడుండాడు రాజ్యముండాది - కేశవరెడ్డి
రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
శివారెడ్డి కవిత - శివారెడ్డి
సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్‌ సుదర్శనం
స్వేచ్ఛ - ఓల్గా
తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు
కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి
..😊😊😊

Tuesday, 4 April 2017

తెలుగు వెలుగు

*రాముడి వంశ వృక్షo*

*ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం*

*బ్రహ్మ కొడుకు మరీచి*

*మరీచి కొడుకు కాశ్యపుడు.*

*కాశ్యపుడు కొడుకు సూర్యుడు.*

*సూర్యుడు కొడుకు మనువు.*

*మనువు కొడుకు ఇక్ష్వాకువు.*

*ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*

*కుక్షి కొడుకు వికుక్షి.*

*వికుక్షి కొడుకు బాణుడు.*

*బాణుడు కొడుకు అనరణ్యుడు.*

*అనరణ్యుడు కొడుకు పృధువు.*

*పృధువు కొడుకు త్రిశంఖుడు.*

*త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)*

*దుంధుమారుడు కొడుకు మాంధాత.*

*మాంధాత కొడుకు సుసంధి.*

*సుసంధి కొడుకు ధృవసంధి.*

*ధృవసంధి కొడుకు భరతుడు.*

*భరతుడు కొడుకు అశితుడు.*

*అశితుడు కొడుకు సగరుడు.*

*సగరుడు కొడుకు అసమంజసుడు.*

*అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*

*అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*

*దిలీపుడు కొడుకు భగీరధుడు.*

*భగీరధుడు కొడుకు కకుత్సుడు.*

*కకుత్సుడు కొడుకు రఘువు.*

*రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*

*ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*

*శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*

*సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*

*అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*

*శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*

*మరువు కొడుకు ప్రశిష్యకుడు.*

*ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*

*అంబరీశుడు కొడుకు నహుషుడు.*

*నహుషుడు కొడుకు యయాతి.*

*యయాతి కొడుకు నాభాగుడు.*

*నాభాగుడు కొడుకు అజుడు.*

*అజుడు కొడుకు ధశరథుడు.*

*ధశరథుడు కొడుకు రాముడు.*

*రాముడి కొడుకులు లవ కుశలు . .*

*ఇది రాముడి వంశ వృక్షo ...*
***************👏👏👏

Sunday, 5 March 2017

ఇవి చదివి తెలుసుకొందాం. .
*
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.....🐾🐾🐾🐾
ఇవి చదివి తెలుసుకొందాం. .
*
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.....🐾🐾🐾🐾🐾

Tuesday, 21 February 2017

తెలుగు వెలుగు

#త్రికొటేశ్వరుడు
కొటప్పకొండ గుంటూరుజిల్లా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ పుణ్యస్థలాలో కొటప్పకొండ ఒకటి
గుంటూరు జిల్లాలోని నరసారావుపేటకి 13 km
దూరంలో గల ఈక్షేత్రానికి ఎప్రాంతం నుండయిన
సులభంగా చేరుకోవచ్చు రైలు మార్గంలో అయితే
గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పిడుగురాళ్ళలో దిగి అక్కడ నుండి గంట ప్రయాణంతో నరసారావుపేట చేరుకుని
ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు నరసారావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ప్రైవేట్‌ వాహనాల సౌకర్యాలు ఉన్నాయి

             🔱క్షేత్రప్రభావం🔱
చతుర్థశ భువనాలు శివమయ సంధానాలు
మంగళకరు మగు శివ శబ్దము సకల చరాచర
జీవకోటికి ఆధారము పరమేశ్వరుడు అది అంతాలు లేని సర్వ వ్యాపనమైన చైతన్యశక్తి
అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం అందుకే
శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం
అ లింగమే " త్రికొటేశ్వరుడు " అయనే
కొటప్ప అంతటి మహత్కృష్టమైన క్షేత్రమే
త్రికూటాచలం అదియే కొటప్పకొండ పవిత్రమైన
చారిత్రక క్షేత్రాలలో కొటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం కృత,త్రేతా,ద్వాపర, యుగాల నుండి పూణ్యభూమిగా పరిగణింపబడుచున్న
భారతదేశంలోని దక్షిణ భాగంలో అపర కైలాష క్షేత్రంగా పేరొందిన "త్రికొటేశ్వరస్వామి"కి
నిలయమైన దివ్య భక్తి పదమం కొటప్పకొండ
పిలిచిన పలికే ప్రసన్న కొటేశ్వరుడిగా కష్టాలనుండి కడదేర్చే కావురు త్రికొటేశ్వరుడునిగా ఆపదలో ఆదుకునే చేదుకో కోటయ్యగా సంతానం లేనివారికి సంతానాన్ని కలగజేసే సంతానకొటేశ్వరునిగా యుగ యుగాల నుండి
నేటివరకు భక్తులు అరాద్యంగా విరాజామాన మగుచు కోరిన వారికి కొంగు బంగారంగా విరజిమ్ముతూ సుకము,శాంతి,ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ, శుభము,విజయము, ఆవలీలగా అనూహ్యంగా ప్రసాదించే శ్రీమతి
కొటేశ్వర సన్నిధానం కొటప్పకొండ

తెలుగు

"దండం దశగుణం భవేత్" అనే వాక్యాన్ని అందరూ తరచుగా కొట్టడానికి అనుకొంటారు.
కాని ఈశ్లోకం లో వివరణ చూడండి
శ్లోకం: విశ్వానాహి పశుషు
          కర్దమప్సు చ నిమ్నగా:!
          వార్ధక్యే విపినే వహ్నౌ
          దండం దశగుణం భవేత్!!
వి:= పక్షి
శ్వాన= కుక్క
అహి= సర్పమ
పశు= జన్తువు
కర్దమ=బురద
అప్సు= నీటిలో
నిమ్నగా: = ఎత్తుపల్లాల నేలపై
వార్ధక్యే= ముసలి తనంలో
విపినే = అడవిలో
వహ్నౌ= అగ్ని (ఆర్పడం)లో
     ఇలాంటి 10 సందర్భాలలో దండం(=చేయూత కర్ర)10 రకాలుగా మనిషికి తోడ్పడుతుందని శాస్త్ర వచనం

తెలుగు

శ్రీ మహా విష్ణువు:బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు త్రిమూర్తులు.అందు సృష్టికి బ్రహ్మయు,స్థితికి విష్ణువు,లయమునకు హరుడును అధిపతులు.ఈ మూడింటి స్థితియు శాశ్వము కనుక మరల విష్ణువే స్థితి కధిపతియై,సృష్టిలయములకన్న ప్రాధాన్యము వహించు చున్నాడు.స్థితి లేనిది లయము లేదు.లయము లేనిది మరల సృష్టిలేదు.సృష్టి,స్థితి,లయములు మూడునూ కలుగు చుండుటయే శాశ్వతమైన స్థితి.దానికి విష్ణు వధిపతి.దీనిని బట్టి సృష్టి స్థితి లయములలోని స్థితి యొకటియు,నీ మూడింటి స్థితి యొకటియు వేరుగా నున్నవని తెలియుచున్నది.అందు మూడింటిలో నొకటియైన స్థితి కధిపతి త్రిమూర్తులలోని విష్ణువు.ఈ మూడింటి యస్తిత్వమైన స్థితి కధిపతి త్రిమూర్తుల కతీతుడైన విష్ణువు.ఇతనినే మహా విష్ణువనియు,పరబ్రహ్మ మనియు,పరమాత్మ యనియు,సదాశివుడనియు వ్యవహరింతురు.భాగవత మందలి విష్ణువనగా శ్రీ మహా విష్ణువే గానీ,త్రిమూర్తులలోని విష్ణువు కాదు.విష్ణువను శబ్దముమునకు సర్వవ్యాపి యనియే అర్థము.భాగవతమున,విష్ణు పురాణమున, విష్ణు సహస్ర నామముల యందు ప్రతిపాదింపబడిన విష్ణు వితడే.వేదములయందు,విష్ణు సూక్తములలోను,అగ్ని స్తుతులలోను ప్రతిపాదింపబడిన దైవము కూడా నితడే.దీనిని గ్రహించిన వారికి విష్ణు ప్రతిపాదికములైన గ్రంథములయందు విష్ణువునకు, శివ ప్రతిపాదికములైన గ్రంథముల యందు సదాశివునకు,వేదాంతమందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమునకును భేదము లేదని తెలియును.దీనిని గ్రహింపలేని నాడు త్రిమూర్తులలో విష్ణువు గొప్పవాడని వైష్ణువులును,శివుడు గొప్పవాడని శైవులును, వారిని మించినవాడు పరబ్రహ్మమని వేదాంతులును వాదించుకొనుచుందురు.(Master E.K.గారి భాగవత రహస్య ప్రకాశము నుండి).